పెట్రోల్ పంప్ వద్ద మంటల్లో బైక్ దగ్దం.. తప్పిన పెను ప్రమాదం

పెట్రోల్ పంప్ వద్ద మంటల్లో  బైక్ దగ్దం.. తప్పిన పెను ప్రమాదం

కుత్బుల్లాపూర్ సురారం పోలీస్ స్టేషల్ పరిధిలో అగ్ని  ప్రమాదం చోటుచేసుకుంది.  జీడిమెట్ల బస్ డిపో సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద ప్రమాదవశాత్తు ఓ బైక్ మంటల్లో దగ్ధమైంది.  డిసెంబర్ 12వ తేదీ మంగళవారం ఇండియన్ పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకునేందుకు  ఓ వ్యక్తి బైక్ పై వచ్చాడు. అయితే, పెట్రోల్  కొట్టించుకుని బయటకు వస్తున్న క్రమంలో.. బైక్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ అయ్యి పెట్రోల్ బయటకు వచ్చి.. హీట్ ఎక్కిన ఇంజన్ పై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బైక్ దగ్ధమైంది.

 బైక్ పై ఉన్న వ్యక్తి వెంటనే అప్రమత్తమైన దూరంగా పరుగెత్తడంతో బతికిపోయాడు. పెట్రోల్ పంప్ వద్ద ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారు  భయంతో దూరంగా పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహిటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. దీంతో పెట్రోల్ బంక్ పేలిపోకుండా పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.