- ఇమ్రాన్ మద్దతుదారులపై బిలావల్ భుట్టో మండిపాటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మండిపడ్డారు. వాళ్లంతా టెర్రరిస్టులకు ఏమాత్రం తక్కువ కాదన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) నేతలతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు.
శనివారం జరిగిన పాక్ పీపుల్స్ పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. పీటీఐ మద్దతుదారులను దేశ వ్యతిరేక శక్తులన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్లను సమర్థించారు. ఎన్నో కేసులున్న ఇమ్రాన్ఖాన్కు బెయిల్ మంజూరు చేయడాన్ని భుట్టో తప్పుపట్టారు. దేశ న్యాయవ్యవస్థ అవసరానికి మించిన రాజకీయంగా మారుతోందని ఆరోపించారు.