భిక్షాటన చేసిన కమలాపూర్ బిల్ట్ కార్మికులు

భిక్షాటన చేసిన కమలాపూర్ బిల్ట్ కార్మికులు

ములుగు జిల్లా కమలాపూర్ లోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- బిల్ట్ కార్మికులు యాజమాన్యంపై నిరసన తెలిపారు. 52 నెలలుగా యాజమాన్యం తమకు జీతాలు చెల్లించకపోవడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మంగపేట మండలం కమలాపురంలో భిక్షాటన చేశారు బిల్ట్ కార్మికులు.

ముఖ్యమంత్రి స్పందించాలి అనీ.. బిల్ట్ కార్మికులను ఆదుకోవాలని కోరారు.