
జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం ఫారెస్ట్ డివిజన్లో ఈ నెల 13 నుంచి 15 వరకు బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022లో ఇక్కడ బర్డ్వాక్ ఫెస్టివల్ ప్రారంభించారు. గతంలో రెండు సార్లు ఫిబ్రవరిలో నిర్వహించగా.. మూడో ఫెస్టివల్కు డిసెంబర్లో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర, కాకినాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి బర్డ్ లవర్స్, ఫొటోగ్రాఫర్లు వచ్చారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
బర్డ్ వాక్ ఫెస్టివల్లో పాల్గొనేవారు రూ.2వేలు చెల్లించి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13న బర్డ్ వాచర్ల పేర్లు నమోదు చేసుకుని సాయంత్రానికి రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపు బర్తన్పేట్ క్యాంపు, మరో గ్రూపు బైసన్కుంటలో రాత్రి బస చేసి 14న ఉదయం పక్షులను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14న రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆ రోజు రాత్రి బస చేసి15న ఉదయం బర్డ్వాక్కు వెళ్తారు. సాయంత్రం గెట్టుగెదర్ ఏర్పాటుచేసి వారి అనుభవాలను తెలుసుకుంటారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతికి 9441057771 ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాలకు జన్నారం రేంజ్ ఆఫీసర్ సుష్మారావు 9989591096, ఇందన్పల్లి రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ను 9618357086 సంప్రదించాలి.
300 జాతులకు పైగా పక్షులు
కవ్వాల్ టైగర్ జోన్పరిధిలో 300 జాతులకు పైగా పక్షులున్నట్లు అధికారులు చెబుతున్నారు. కల్పకుంట, బైసన్కుంట, మైసమ్మకుంట ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. చలికాలంలో విదేశాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చే పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. బర్డ్వాక్లో భాగంగా పక్షుల్లో రకాలు, వాటి శాస్త్రీయ నామాల వివరా లతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.