
స్ట్రీట్ డాగ్స్ బెడద నివారణకు బల్దియా చర్యలు
గ్రేటర్ లో 30 క్యాచింగ్ పాయింట్లు
హైదరాబాద్, వెలుగు: స్ట్రీట్ డాగ్స్ బెడద నివారణపై ఎట్టకేలకు బల్దియా దృష్టి పెట్టింది. ఈ సమస్యపై చాలా రోజులుగా కంప్లయింట్స్ వస్తుండటంతో డాగ్స్ బర్త్ కంట్రోల్ సర్జరీలను పెంచేందుకు చర్యలు మొదలు పెట్టింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు కుక్క కాటుకు గురై ఐపీఎం, ఫీవర్ హాస్పిటల్ కు వస్తున్న వారి ఏరియాల్లో డాగ్స్ క్యాచింగ్ చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో కుక్కలు ఉన్న చోట వాటి సంతతి మరింత పెరుగుతోంది. దీంతో డాగ్స్ బర్త్ కంట్రోల్ సర్జరీల కోసం వాటిని అంబర్ పేట్, కూకట్ పల్లి, జీడిమెట్ల, ఎల్బీ నగర్, చుడీ బజార్ ల లోని యానిమల్ వెల్ఫేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. అక్కడే బర్త్ కంట్రోల్ సర్జరీలతో పాటు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. వీలైనంత వరకు కుక్కల సంఖ్యను తగ్గిస్తున్నామని బల్దియా చెప్తోంది.
ఏబీసీ యాప్..
కుక్కలను వ్యాక్సిన్ కోసం తీసుకెళ్లిన తర్వాత మళ్లీ వాటిని అదే చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వదిలేస్తున్నారని కంప్లయింట్స్ వస్తున్నాయి. దీంతో ఎక్కడ నుంచి తెచ్చిన కుక్కలను మళ్లీ అదే ప్రాంతంలో వదిలేసేందుకు త్వరలోనే యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) పేరుతో బల్దియా యాప్ ను తీసుకురానుంది. డాగ్స్ని పట్టుకెళ్లే సమయంలో వీడియో రికార్డ్ చేసి వ్యాక్సిన్, బర్త్ కంట్రోల్ సర్జరీ చేసిన తర్వాత తిరిగి వదిలి పెట్టే టైమ్ లోనూ వీడియో తీసి అప్ లోడ్ చేస్తారు. ఈ యాప్ ద్వారా ఒక ప్లేస్ లోని కుక్కలను మరో ప్లేస్ లో వదిలివేయకుండా గుర్తించవచ్చు. డాగ్స్ బర్త్ కంట్రోల్ కోసం బల్దియా అధికారులు స్వచ్ఛంద సంస్థల సహాయం కూడా తీసుకుంటున్నారు. వారికి ఒక్కో సర్జరీ కి రూ. 1500 ఇస్తున్నారు. నెలకు 300 వరకు ప్రస్తుతం సర్జరీలు చేస్తుండగా వీటి సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. గతంతో పోలిస్తే గ్రేటర్ లో కుక్కల సంఖ్య తగ్గుతోంది. కుక్కలతో సమస్యలు, కుక్క కాటులు పెరుగుతున్నప్పటికీ కొన్నేండ్లుగా బల్దియా అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా వీటి పాపులేషన్ చాలా తగ్గింది. నాలుగేండ్ల క్రితం గ్రేటర్ లో 6 లక్షల కుక్కలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 3.60 లక్షలకు చేరిందని బల్దియా వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. పలు ఎన్జీఓలతో కలిసి కుక్కల సమస్య నివారణకు కృషి చేస్తున్నామంటున్నారు.
For More News..
పాల డెయిరీలో రూ. 50 కోసం గొడవ.. యువకుడు మృతి
న్యూడ్గా మాట్లాడుకుందామని చెప్పుడు.. స్క్రీన్ షాట్ తీసి బెదిరించుడు..
ఇంటర్ ఎగ్జామ్స్ మే 3 నుంచి! ఫస్టియర్లో ఫెయిలైనోళ్లను పాస్ చేసే యోచన
కేసీఆర్ ప్రోగ్రాంలకు తగ్గిన వ్యూయర్షిప్.. లక్షల నుంచి వందల్లోకి చేరిన వీక్షకులు