స్కూల్ లో బర్త్ డే పార్టీ.. తిట్టారని స్టూడెంట్ ఆత్మహత్య

స్కూల్ లో బర్త్ డే పార్టీ.. తిట్టారని స్టూడెంట్ ఆత్మహత్య

ఖమ్మం: ఓ విద్యార్థి సరదాగా బర్త్ డే పార్టీ చేసుకుంటే తిట్టారనే మనస్తాపంతో టెన్త్ స్టూడెంట్ పురుగుల మందు తాగాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ఫలించక కన్నుమూశాడు. పదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. 
మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రైవేటు స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తన బర్త్ డే వేడుకలను సరదాగా తరగతి గదిలో స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు. సీసీ ఫుటేజీలో నమోదైన బర్త్ డే వేడుకలను చూసి విద్యార్థి ని ఇబ్బందులకు గురిచేశారని, తోటి విద్యార్థుల సమక్షంలో వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి రవాణా ముఠా అరెస్ట్

ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ కు బండి సంజయ్ డెడ్ లైన్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష.. జరిమానా

శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ 21కి వాయిదా

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. వేసుకున్న గుడిశెలను కూల్చేశారు