17 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇన్ చార్జ్ ల నియామకం

17 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇన్ చార్జ్ ల  నియామకం

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు ప్రభారీ (ఇన్ చార్జ్ )లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ నియమించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ ప్రభాకర్ ను కరీంనగర్, మాజీ ఎమ్మెల్యే యండల లక్ష్మీనారాయణని మల్కాజ్ గిరి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావును నల్గొండ, మాజీ ఎమ్మెల్యే చింతాల రామచంద్రారెడ్డిని భువనగిరికి నియమించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పిన బీజేపీ.. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఇప్పటి నుంచే ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండేందుకు కార్యక్రమాలు చేపడుతోంది.

మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ప్రజల కోసం ఉద్యమిస్తోందని చెప్పారు. ఇక రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు.