ఉత్తరాఖండ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ

ఉత్తరాఖండ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ

ఉత్తరాఖండ్లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమైంది. రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. మేజిక్ ఫిగర్కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఒకేపార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.  బీజేపీ 47స్థానాల్లో పాగా వేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకుంది. పంజాబ్ లో ప్రభంజనం సృష్టిం ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరాఖండ్ లో ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 57స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి మాత్రం సీట్ల సంఖ్య తగ్గాయి.