-
రాజస్థాన్ లో 41 మందితో బీజేపీ తొలి జాబితా రిలీజ్
-
ఎంపీలో 57, చత్తీస్గఢ్లో 64 మంది ఖరారు
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజస్థాన్లో బీజేపీ 41 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా రిలీజ్ చేసింది. అందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లు ఇచ్చింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు స్థానం దక్కలేదు. ఈ నెల ఒకటో తేదీన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు మళ్లీ బుధ్నీ సెగ్మెంట్నే కేటాయించింది. చత్తీస్గఢ్లోనూ 64 మంది అభ్యర్థులతో బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.