బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: అజయ్ మేకన్

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: అజయ్ మేకన్

జైపూర్: బీజేపీ ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాజస్తాన్ కాంగ్రెస్ ఇన్ చార్జ్, నేషనల్ సెక్రటరీ అజయ్ మేకన్ విమర్శించారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాజస్థాన్ కు చెందిన 102 మంది వీర ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. డబ్బు ఇవ్వజూపినా, ఒత్తిళ్లు పెట్టినా వాళ్లు తలొగ్గలేదు. కాంగ్రెస్ బ్రిటిషర్లతో పోరాడి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంపై మున్ముందు ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయి. దీనికి మనం సిద్ధంగా ఉండాలి’ అని అజయ్ చెప్పారు.