వాళ్లని అల్లుళ్ళ మాదిరిగా మేపుతున్నారు

వాళ్లని అల్లుళ్ళ మాదిరిగా మేపుతున్నారు

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ కోసం చర్యలు తీసుకుంటుంటే… TRS పార్టీ అండతో MIM పార్టీ మాత్రం వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. అక్రమంగా రోహింగ్యాలు ఆధార్ తీసుకుంటే… మజ్లిస్ పార్టీ నేత అసదుద్ధీన్ ఓవైసీ వాళ్ళకి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నాడన్నారు. రోహింగ్యాలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడంపై లక్ష్మణ్  సోమవారం రాష్ట్ర  డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

180 మంది రోహింగ్యాల కు ఆధార్, ఓటర్ ,ఇతర గుర్తింపు కార్డులు ఎలా ఇచ్చారు? అనే విషయంపై పోలీసులను విచారణ చేయాలని కోరారు. అందుకు కారకులెవరనే విషయాన్ని పోలీసులు గుర్తించాలన్నారు. ఈ దేశం కానీ వాళ్ళు గుర్తింపు కార్డులు తీసుకుంటుంటే… పోలీసులు  ప్రేక్షక పాత్ర పోషిస్తున్నరా?అని అడిగారు.

ట్విట్టర్ పోస్ట్ లకు స్పందించే కేటీఆర్ ఓవైసీ ట్విట్టర్ కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ.. అక్రమంగా ఆధార్ కార్డులు పొందిన వారు దొరికితే…. ప్రభుత్వం వారిని అల్లుళ్ళ మాదిరిగా  మేపుతుందని అన్నారు. MIM పార్టీ అనే పాముకు ప్రభుత్వం పాలు పోసి  పెంచుతుందని, అది ఏదో ఒకరోజు నాగు పాములా కేసీఆర్, కేటీఆర్ ను కాటు వేస్తుందని లక్ష్మణ్ అన్నారు.