ఎక్కడో అమ్మాయిలు పట్టుబడితే నన్ను బద్నాం చేస్తున్నరు

ఎక్కడో అమ్మాయిలు పట్టుబడితే నన్ను బద్నాం చేస్తున్నరు

హైదరాబాద్: సోషల్ మీడియాలోని ఓ వర్గం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అసభ్యకరంగా పోస్ట్‌‌లు పెడుతున్నారంటూ సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టింగ్‌‌ల మీద సీపీ సజ్జనార్‌‌కు ఆమె ఫిర్యాదు చేసింది. ఎక్కడో అమ్మాయిలు పట్టుబడితే అందులో తానే పట్టుబడినట్లు పోస్టులు పెడుతున్నారని మాధవీలత ఫైర్ అయ్యింది.

‘సోషల్ మీడియాలో ఒక వర్గం నన్ను కావాలనే టార్గెట్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ అమ్మాయిలు పట్టుబడినా అందులో నేను పట్టుబడినట్లు ప్రసారం చేస్తున్నారు. ఈ విషయంపై సైబరాబాద్ సైబర్ క్రైమ్‌‌లో పోలీసులకు ఫిర్యాదు చేశా. దీని వెనుక ఉన్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. బీజేపీ పార్టీలో ఉన్నందునే నన్ను టార్గెట్ చేస్తున్నారు. మానసికంగా నన్ను అత్యాచారం చేస్తున్నారు. శక్తి ఉన్నంతసేపు సోషల్ మీడియాలో ఫైట్ చేశా. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించా. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని మాధవీలత పేర్కొంది.