బీజేపీతోనే అణగారినవర్గాల అభివృద్ధి : చంద్రుపట్ల సునీల్ రెడ్డి

బీజేపీతోనే అణగారినవర్గాల అభివృద్ధి  : చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని, వెలుగు: బీజేపీతోనే అణగారినవర్గాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి సునీల్‌‌‌‌‌‌‌‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, దీనిలో భాగంగానే రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు.  

అంతకుముందు మంథని మండలం ఏక్లాస్‌‌‌‌‌‌‌‌పూర్​గ్రామానికి చెందిన సుమారు 80 మంది  బీజేపీలో చేరారు. వారికి సునీల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో లీడర్లు వీరబోయిన రాజేందర్, బూడిద తిరుపతి, చిలువేరు సతీశ్‌‌‌‌‌‌‌‌, సత్యప్రకాశ్‌‌‌‌‌‌‌‌, సంతోష్, శ్రీనివాస్, మల్లికార్జున్,  మౌనిక, నారాయణ పాల్గొన్నారు.