ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం చెప్పిన అంశాలు కింది స్థాయిలో జరగడం లేదన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. రాష్ట్ర మంత్రులు రాజకీయాలు చేస్తూ.. ముందు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే గోనె సంచులు ఇస్తున్నారన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రైతులు క్షేత్ర స్థాయిలో పడుతున్నారని ఆమె అన్నారు . ధాన్యం కొనుగోలు సెంటర్ లలో రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎం దృష్టికి తీసుకొస్తే.. మంత్రులు రాజకీయం చేస్తున్నారని అన్నారు.
తాము ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తూ సూచనలు చేస్తున్నామని, దాన్ని కూడా రాజకీయంగా చూస్తున్నారని అరుణ అన్నారు. తమ సూచనలు పాజిటివ్ గా తీసుకోకుండా నెగటివ్ గా బావిస్తున్నారని విమర్శించారు. మీ మంత్రులెవరూ.. రైతుల దగ్గరకు పోవడం లేదని, వారిని రాజకీయాలు చేయొద్దని చెప్పాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. రాజకీయాలు చేయదల్చుకుంటే మీ మంత్రులెవరు బయట తిరగ లేరని అన్నారు.