
వనపర్తి, వెలుగు: మోదీ హయాంలోనే రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరి నారాయణరెడ్డి తెలిపారు. మోదీ 11 ఏండ్ల వికసిత్ భారత్, గరీబ్ కల్యాణ్ సుపరిపాలనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి నారాయణ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో సోమవారం ఫొటో ఎగ్జిబిషన్, లక్ష్మీకృష్ణ గార్డెన్లో ప్రొఫెషనల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో కేంద్ర పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ45,169 కోట్లు రాగా, ఎన్డీఏ పదేండ్ల పాలనలో రూ.2,19,860 కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు.
రైల్వేల అభివృద్ధికి రూ.1,21,782 కోట్లు రిలీజ్ చేశారని తెలిపారు. తెలంగాణను పదేండ్ల పాటు కేసీఆర్ ఒక రజాకర్లాగా పాలించారని విమర్శించారు. అట్లూరి రామకృష్ణ, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హేమారెడ్డి, రవీందర్, పురుషోత్తం రెడ్డి, శ్రీశైలం, పెద్దిరాజు పాల్గొన్నారు.