అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుంది

అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుంది

కేంద్రం నిధులిచ్చినా చంద్రబాబు గ్రాఫిక్స్ కే పరిమితమయ్యారని అన్నారు బీజేపీ నేత పురందేశ్వరీ. రాజధానిని మార్చవద్దని కోరుతూ పలు గ్రామాల రైతులు పురందేశ్వరీని కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుందన్నారు. అయితే రాజధాని రైతులకు టీడీపీ,వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. రైతులు ప్రభుత్వానికి భూముులిచ్చారు కానీ పార్టీలకు కాదన్నారు. జీఎన్ రావు నివేదిక బహిర్గతం కాలేదని..కేబినెట్ లో చర్చ జరగాలన్నారు.రైతులకు సమాధానం చెప్పాక మూడు రాజధానులపై బీజేపీ స్పందిస్తుందన్నారు పురంధేశ్వరీ.