ఈ నెల 6 నుంచి 20 వరకు సామాజిక న్యాయ పక్షోత్సవాలు

ఈ  నెల 6 నుంచి 20 వరకు సామాజిక న్యాయ పక్షోత్సవాలు

బీజేపీ అధికారంలోకి వచ్చాక... రాజనీతిలో మార్పులు జరిగాయన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక కుటుంబపాలను రూపుమాపామన్నారు. బీజేపీ అభివృద్ధితోనే.. భారత్ అభివృద్ధి సాగుతుందన్నారు తరుణ్ చుగ్. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు సామాజిక న్యాయ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. పేదల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు చేరువ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు లక్ష్మణ్. అమీర్ పేటలని ఆదిత్య పార్క్ లేన్ లో మోడీ స్పీచ్ వీక్షించారు బీజేపీ నేతలు తరుణ్ చుగ్, లక్ష్మణ్, కార్యకర్తలు. మోడీ స్పీచ్ తర్వాత సత్యం థియేటర్ దగ్గర శోభా యాత్రలో పాల్గొన్నారు బీజేపీ నేతలు.

 

నాకు ఇగో లేదు.. సీఎంతో చర్చలకు సిద్ధం

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే