
సీఎం కేసీఆర్కి తెలంగాణ అంటే కేవలం గజ్వేల్, సిద్ధిపేట మాత్రమేనా అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. గురువారం కేసీఆర్ సిద్ధిపేట పర్యటనలో భాగంగా సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో దాదాపు రూ. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. ఒక సీఎం కేవలం రెండు ప్రాంతాలపైనే దృష్టిపెట్టడం సరికాదని ఆమె అన్నారు. ఈ రెండు ప్రాంతాలు కాకుండా మిగిలిన తెలంగాణకు కూడా ఆయనే కదా సీఎం అని ఆమె అన్నారు. మిగిలిన ప్రాంత ఎమ్మెల్యేలు ఈ విషయంపై నోరుమెదపకపోవడం దారుణమని ఆమె అన్నారు.
‘గజ్వేల్, సిద్దిపేటలపై వందల వేల కోట్ల విలువైన వరాలు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దొరగారికి తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలు మాత్రమేనా? మిగిలిన తెలంగాణ అంతా ఆయన దృష్టిలో ప్రాంతేతర పరగణానా? ఇంత అన్యాయం ఏమిటని 100 మంది వరకూ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం శోచనీయం’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.
గజ్వేల్, సిద్దిపేటలపై వందల వేల కోట్ల విలువైన వరాలు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దొరగారికి తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలు మాత్రమేనా?
— VijayashanthiOfficial (@vijayashanthi_m) December 10, 2020
For More news..