సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించాలె

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించాలె
  • కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన సింగరేణి వీఆర్ఎస్ ​డిపెండెంట్లు
  • మద్దతుగా నిలిచిన వివేక్​ వెంకటస్వామి

మందమర్రి, వెలుగు: సింగరేణిలో న్యాయంగా తమకురావాల్సిన ఉద్యోగాలను ఇప్పించేందుకు కృషి చేయాలని సింగరేణి వీఆర్ఎస్​ డిపెండెంట్లు కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కోరారు. మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు ​వివేక్ ​వెంకటస్వామి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న వీఆర్ఎస్​ డిపెండెంట్ వారసులు శుక్రవారం కేంద్రమంత్రిని కలిశారు. సింగరేణిలో 1997 నుంచి 2002 వరకు వీఆర్ఎస్​ కింద తొలగించిన కార్మికుల పిల్లలందరికీ ఉద్యోగాలిచ్చే విధంగా చొరవ చూపాలని వారు కోరారు. వారసులకు జాబ్​ వస్తుందన్న ఆశతో రెండు నుంచి పదేండ్ల సర్వీస్ కూడా వదులుకున్నారని చెప్పారు. ఉద్యోగానికి ఫిట్​అయిన తర్వాత ట్రైనింగ్​ అనంతరం అప్పటి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, సింగరేణి యాజమాన్యంతో అగ్రిమెంట్​ చేసుకొని ఉద్యోగాలు రాకుండా చేసిందని ఆరోపించారు. ఉపాధి లేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఉద్యోగాల కోసం ఏండ్లుగా ఉద్యమిస్తున్నా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్​ కనికరించడం లేదన్నారు. మూడేండ్ల క్రితం బీఎంఎస్ లీడర్ల ఒత్తిడితో కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్​ లేబర్​ కమిషనర్ యాజమాన్యం, కార్మిక సంఘాల లీడర్లను చర్చలకు ఆహ్వానించినట్లు చెప్పారు. తమకు ఉద్యోగాలు కల్పించే  విషయంలో జాప్యం జరుగుతోందని,  ఈ అంశం ఢిల్లీ కార్మిశాఖ ఆఫీసర్ల చేతుల్లో ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, ఉద్యోగాలు ఇచ్చేలా చొరవ చూపాలని మంత్రిని  కోరారు. అనంతరం వివేక్​ వెంకటస్వామి, బీఎంఎస్​ మాజీ ప్రెసిడెంట్​ చింతల సూర్యనారాయణతో కలిసి కేంద్ర మంత్రికి వీఆర్ఎస్​ డిపెండెంట్లు వినతిపత్రం అందజేశారు.

For More News..

సీరం ఫైర్ యాక్సిడెంట్‌‌లో రూ.వెయ్యి కోట్ల నష్టం

రామ మందిర నిర్మాణానికి వివేక్‌‌ వెంకటస్వామి రూ. కోటి విరాళం

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు