కాశీబుగ్గ, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మాజీ సీఎం కేసీఆర్కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీజేపీ రాష్ర్ట నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎద్దేవా చేశారు. గురువారం వరంగల్సిటీలోని బస్టాండ్నిర్మాణానికి తవ్విన ఏరియాలో వరద చేరడంతో బీజేపీ నేతలు అందులో పడవ ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా రవికుమార్మాట్లాడుతూ కాకతీయుల రాజధాని ఓరుగల్లులో బస్టాండ్లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంట్రాక్ట్ పనుల కమీషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ నేతలకు అభివృద్ధిపై లేదని ఆరోపించారు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో మంత్రి కొండా సురేఖ నిర్లక్ష్యం కారణంగా గుంతల్లో నీరు నిలిచి చెరువులా మారిందని చెప్పారు.
వరంగల్ఆత్మగౌరవ పోరాట మహా ధర్నా –-2 పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్నేతలకు ఉచిత పడవ ప్రయాణ నిరసన చేపట్టినట్టుగా తెలిపారు. బీజేపీ పార్టీ నేతలు సతీశ్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పుల్లారావు, హరిశంకర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
