
- టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో బీజేపీ నేతలు
ముషీరాబాద్/ మెహిదీపట్నం/ పద్మారావునగర్/ షాద్నగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టిఫిన్ బైఠక్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నట్లు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్. గౌతమ్ రావు అన్నారు. మంగళవారం ఓయూ కాలనీలో జరిగిన టిఫిన్ బైఠక్ ప్రోగ్రామ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సిటీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు టిఫిన్ బైఠక్ ప్రోగ్రామ్ను నిర్వహించారు.
బీజేపీ నాయకుడు దేవరవంశీ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ ఎస్బీఐ కమ్యూనిటీ హాల్లో, సనత్నగర్లో లక్ష్మీనారాయణ పార్కులో, షాద్ నగర్ పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు జరిగాయి. ఆయా ప్రోగ్రామ్స్లో గద్వాల జిల్లా ఇన్ చార్జి బి. వెంకట్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నేత పాపారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఆనంద్ గౌడ్, సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్యాంసుందర్ గౌడ్, బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణు వర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.