అక్టోబర్ 10న అమిత్ షా సభ కోసంస్థల పరిశీలన

అక్టోబర్ 10న అమిత్ షా సభ కోసంస్థల పరిశీలన

శంషాబాద్, వెలుగు: అక్టోబర్10న రాజేంద్రనగర్ సెగ్మెంట్​లో​కేంద్ర హోం మంత్రి అమిత్​షా బహిరంగ సభ జరగనుండగా.. అందుకు సంబంధించి స్థల పరిశీలన కోసం బీజేపీ నేతలు శుక్రవారం శంషాబాద్, రాజేంద్రనగర్ ఏరియాల్లో పర్యటించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంషాబాద్ లోని క్లాస్ కన్వెన్షన్ సమీపంలోని స్థలాన్ని, కాళీమందిర్ వద్ద మరో స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. రెండు చోట్ల స్థలాలను పరిశీలించి రాష్ట్ర నాయకత్వానికి పంపించామన్నారు. సభ జరగబోయే స్థలాన్ని నేడు రాష్ట్ర నాయకులు ఫైనల్ చేస్తారన్నారు. నర్సింహా రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్ రాజ్, బుక్క వేణుగోపాల్, అసెంబ్లీ కన్వీనర్ మల్లేశ్ యాదవ్, పార్లమెంటరీ కన్వీనర్ మల్లారెడ్డి, సిద్దిపేట ఇన్ చార్జి అంజన్ గౌడ్, కార్యకర్తలు ఉన్నారు.