రాముడు పేరుతో సిద్ధాంతాలు తప్పిన బీజేపీ : కూనంనేని సాంబశివరావు

రాముడు పేరుతో సిద్ధాంతాలు తప్పిన బీజేపీ : కూనంనేని సాంబశివరావు

షాద్ నగర్, వెలుగు: రామరాజ్యం పేరు చెప్పుకొని బీజేపీ అధికారంలోకి వచ్చిందని, శ్రీరాముడి ఆశయాలకు విరుద్ధంగా పాలన కొనసాగిస్తుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ సిద్ధాంతాలైనా ప్రజల కోసమే పుట్టాయని, వాటిని ఆచరణలో పెట్టడం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. షాద్ నగర్ టౌన్ లో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో కూనంనేని సాంబశివరావు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను సన్మానించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ..కాగితాలపైన ఉన్న బీజేపీ సిద్ధాంతాలను అమలులో మాత్రం చూపడం లేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనతో విసుగుచెందిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ గెలుపులో సీపీఐ పాత్ర కూడా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీలు తాండ్ర విశాల, వెంకట్రామిరెడ్డి, రఘు, బాబర్ ఖాన్, సీపీఐ నేతలు  పానుగంటి పర్వతాలు, వెంకట్రామిరెడ్డి  పాల్గొన్నారు.