అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేనే రాజు నేనే మంత్రి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలకు వెళ్తానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారమే హిమంత పై దాడి చేయించారని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడతారని మండిపడ్డారు. హిమంత బిశ్వశర్మపై దాడి వెనక కేసీఆర్ హస్తం ఉందన్నారు.
అసోం సీఎం మాట్లాడుతుండగా టీఆర్ఎస్కార్యకర్త దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పక్క రాష్టం సీఎం తెలంగాణకు వచ్చినప్పుడు వారికి రక్షణ, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. గణేశ్ఉత్సవాలకు వచ్చిన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పై టీఆర్ఎస్ నాయకులు ప్లాన్ ప్రకారమే దాడి చేశారని తెలిపారు.