కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదు..తెలంగాణ ద్రోహి

కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదు..తెలంగాణ ద్రోహి

కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదని..తెలంగాణ ద్రోహీ అని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ తో దేశ ప్రజలను తాగుబోతులను చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. మునుగోడు ఎన్నికలో ప్రజలు కేసీఆర్కు కర్రకాల్చి వాత పెడతారన్నారు. పేద ప్రజలకు పేదబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే 1వ తేదీనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 

బీజేపీ అధికారంలోకి రాగానే పెళ్లిపందిరిలోనే కళ్యాణలక్ష్మీ ఇస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. పేద రైతులకు మాత్రమే రైతుబంధు అందేవిధంగా చూస్తామని.. కౌలు రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మోడీ సహకారంతో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు కలుషితంగా వస్తున్నాయని.. పాత ట్యాంకులకే రంగులు వేసి మిషన్ భగీరథ పేర్లు పెట్టారని ఆరోపించారు. 

చర్లగూడెం, లక్ష్మణపురం ప్రాజెక్ట్ పనులు 20శాతం కూడా కాలేదని ఈటల రాజేందర్ అన్నారు. రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మారుతున్నారని అన్నారు. 3500 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను వెంటనే చెల్లించాలన్నారు. పండగా సందర్భంగా గ్రామాలకు వెళ్తున్న ప్రజలను ఆపీ పోలీసులు ఫైన్స్ వేస్తున్నారని మండిపడ్డారు.