హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్రాజకీయ ప్రసంగంలా సాగిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి విమర్శించారు. బడ్జెట్తర్వాత మీడియా పాయింట్లో ఆయన ఎమ్మెల్యేలు పాయల్శంకర్, రామారావు పాటిల్, సూర్యనారాయణతో కలిసి మట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టేలా ఉందన్నారు.
వచ్చే ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్టుగా ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనంలేని బడ్జెట్అన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలను బడ్జెట్ నిరాశపరిచిందని చెప్పారు. అంకెల గారడీ, పొంతన లేని లెక్కలతో రూపొందించారని విమర్శించారు. బడ్జెట్స్పీచ్లో కేసీఆర్ వైఫల్యాలను ఏకరువుపెట్టారని తెలిపారు. ఆయా సమస్యలను ఎలా అధిగమిస్తారో చెప్పలేదన్నారు.
ఈ బడ్జెట్తో కాంగ్రెస్ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులను నిరాశపరిచారని తెలిపారు. నిరుద్యోగ భృతి గురించి మాటేలేదు, భృతి కోసం ఇప్పటికే రూ.1400 కోట్లు బాకీపడ్డారని అన్నారు. కాంగ్రెస్పార్టీ ఇచ్చిన 412 హామీలను నెరవేర్చడానికి బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. 56 శాతం ఉన్న బీసీలకు రూ.8వేల కోట్లనే కేటాయించి బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ కూడా మోసం చేసిందని ఆరోపించారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గొల్ల కురుమలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిని లబ్ధిదారులకు ఎలా కేటాయిస్తారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనలేదన్నారు.