కేంద్రం చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది : పాయల్ శంకర్

కేంద్రం చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది : పాయల్ శంకర్
  • బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ​  

నిజామాబాద్​, వెలుగు: కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీలు కాళేశ్వరం విషయంలో ఒకే రీతిలో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని అసెంబ్లీలో బీజేపీపక్ష ఉపనేత ఎమ్మెల్యే  పాయల్​శంకర్​విమర్శించారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్​ చేయాలని సవాల్​విసిరారు.  బుధవారం ప్రధాని మోదీ 11 ఏండ్ల పాలనలో జరిగిన డెవలప్​మెంట్​పై ఫొటో ఎగ్జిబిషన్​ ప్రారంభించి మాట్లాడారు.  కాంగ్రెస్​ సర్కార్​ సెంట్రల్​ గవర్నమెంట్​అభివృద్ధి పనులను కళ్లుండి చూడలేకపోతోందన్నారు.  అమృత్​ భారత్​ స్కీమ్​ కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్​లు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 

 రూ. 521 కోట్లతో రైల్వే తయారీ యూనిట్ ​కాజీపేటలో ఏర్పాటు చేశామన్నారు.  ముద్ర, జన్​ధన్​, పీఎం ఆవాస్​ యోజన, సడక్​ యోజన, జన ఆరోగ్య యోజన, నేషనల్​ హైవేల నిర్మాణం, ఉజ్వల యోజన, గరీబ్​ కళ్యాణ్​ యోజన, ఇందూర్​లో పసుపు బోర్డు, సమక్క సారక్క యూనివర్సిటీలను ఏర్పాటు చేశామన్నారు.  ఇవన్నీ డెవలప్​మెంట్ కిందకు రావా అని ప్రశ్నించారు.  బీజేపీ జిల్లా జనరల్​ సెక్రెటరీ పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కిశోర్, నాగరాజు 
తదితరులు ఉన్నారు.