
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం విషయంలో ఒకే రీతిలో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని అసెంబ్లీలో బీజేపీపక్ష ఉపనేత ఎమ్మెల్యే పాయల్శంకర్విమర్శించారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని సవాల్విసిరారు. బుధవారం ప్రధాని మోదీ 11 ఏండ్ల పాలనలో జరిగిన డెవలప్మెంట్పై ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ సెంట్రల్ గవర్నమెంట్అభివృద్ధి పనులను కళ్లుండి చూడలేకపోతోందన్నారు. అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
రూ. 521 కోట్లతో రైల్వే తయారీ యూనిట్ కాజీపేటలో ఏర్పాటు చేశామన్నారు. ముద్ర, జన్ధన్, పీఎం ఆవాస్ యోజన, సడక్ యోజన, జన ఆరోగ్య యోజన, నేషనల్ హైవేల నిర్మాణం, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, ఇందూర్లో పసుపు బోర్డు, సమక్క సారక్క యూనివర్సిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ కిందకు రావా అని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కిశోర్, నాగరాజు
తదితరులు ఉన్నారు.