అసెంబ్లీ సమావేశాలు కనీసం 30 రోజులు నడపాలి: రఘునందన్ రావు

అసెంబ్లీ సమావేశాలు కనీసం 30 రోజులు నడపాలి: రఘునందన్ రావు

అసెంబ్లీ సమావేశాలు 30 రోజుల పాటు నిర్వహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రఘునందన్ రావు..   2014 నుంచి ఒక్క అసెంబ్లీ సెషన్ కూడా 30 రోజులు నడవలేదన్నారు.   బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప.. ప్రభుత్వానికి అందరూ మిత్రపక్షాలేనని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నుదుకైనా అసెంబ్లీని కనీసం 30 రోజులు నిర్వహించాలన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. కాళేశ్వరం అప్పులపై సభలో ప్రజేంటేషన్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ కు ఇవే చివరి సమావేశాలన్నారు.  కాంగ్రెస్ వాళ్లు బ్యాంకుల మందు ఆందోళన చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.  రైతు రుణమాఫీపై సచివాలయం ఎదుట, అసెంబ్లీ, ఆర్థిక మంత్రి ఇంటిముందు ధర్నాచేయాలని పిలుపునిచ్చారు రఘునందన్ రావు.   కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసేస్తామని గతంలో చెప్పిన కేసీఆర్.. సిద్దిపేట జిల్లాలో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో చర్చకు రావాలని సవాస్ విసిరారు.  

హైదరాబాద్ చుట్టూ అమ్మిన భూములు ఎంత, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తారో  సభలో చెప్పాలన్నారు.  మైనారిటీబంధు అందరికీ ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం బీసీలందరికీ బీసీ బందు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.  గృహలక్ష్మి కింద ఇస్తానన్న రూ3లక్షలతో ఇల్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు.