జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణం

జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణం

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరుతో తిరుపతికి చెడ్డపేరువస్తోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తిరుమలకు ప్రతి రోజు యావత్ భారత దేశం నుంచి ఎంతో మంది భక్తులు వస్తారని.. అయితో  అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర భక్తులు తెస్తున్న శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్తున్నారన్నారు.

శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద ఇష్యూగా మారిందన్నారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అని వైరల్ అవుతోందన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణని రాజాసింగ్ మండిపడ్డారు.