ఈటల, బండి సంజయ్ వ్యక్తులు కాదు.. శక్తులు

ఈటల, బండి సంజయ్ వ్యక్తులు కాదు.. శక్తులు

తెలంగాణలో టీఆర్‌‌ఎస్ అవినీతి పాలనను అణచివేసేందుకు రాష్ట్రానికి అమిత్ షా బుల్డోజర్లను గిఫ్ట్‌గా పంపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక్కో బుల్డోజర్ రాబోతోందని ఆయన చెప్పారు. ఇందిరా పార్క్‌లో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌తో యుద్ధానికి బీజేపీ సైనికులంతా సిద్ధం కావాలని రాజా సింగ్ పిలుపునిచ్చారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యం ఉంటే.. ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలని రాజాసింగ్ అన్నారు. 

రావణ వధలా.. ట్రిపుల్ ఆర్‌‌ చేతిలో కేసీఆర్‌‌...

తెలంగాణలో టీఆర్‌‌ఎస్ అవినీతి దొంగలను అణచివేసేందుకు బుల్డోజర్లు రాబోతున్నాయని రాజా సింగ్ హెచ్చరించారు. తమ నాయకుడు అమిత్ షా రాష్ట్రానికి బుల్డోజర్లను గిఫ్ట్‌గా పంపిస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి ఒక బుల్డోజర్‌‌ వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యక్తులు కాదని, శక్తులని, వారి సారథ్యంలో కేసీఆర్‌‌పై కొట్లాడుతామని చెప్పారు. రావణ వధ మాదిరిగా.. టిప్రుల్ ఆర్ చేతిలో సీఎం కేసీఆర్‌‌కు అదే గతి పడుతుందని, తెలంగాణలో ఆయన పాలనకు త్వరలోనే అంతం తప్పదని అన్నారు.