రాజాసింగ్పై తప్పుడు కేసులు పెట్టిన్రు

రాజాసింగ్పై తప్పుడు కేసులు పెట్టిన్రు

ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు.తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయించాలని వినతి  పత్రం అందజేశారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ సర్కారు విధానాలను ప్రశ్నిస్తున్నందుకు.. పోలీసులు రాజాసింగ్ పై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. 
ఇప్పటికే ఆ కేసులపై తాను న్యాయస్థానంలో పోరాడుతున్నానని చెప్పారు.

తన భర్తపై చేసిన ఆరోపణలను పోలీసులు నిరూపించలేకపోయారని ఉషాబాయి అన్నారు. తన భర్త రాజాసింగ్ చేసిన చిన్న వ్యాఖ్యలు, ప్రకటనకు కూడా పోలీసులు చాలాసార్లు తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇతరులు ఆవిధంగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని రాజాసింగ్ సతీమణి ఉషాబాయి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.