ముంబై : డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్పై బీజేపీ ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనపై పుణెలో కేసు నమోదైంది. పుణెలోని సాసూన్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హాజరయ్యారు.
ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. ఈ క్రమంలోనే వేదిక నుంచి కిందకు దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పట్టు కోల్పోయి కిందకు పడబోయారు. తేరుకున్నాక అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 353 కింద కాంబ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. మెట్లు దిగుతుండగా కొందరు అడ్డు వస్తే.. తోసుకుంటూ ముందుకు వెళ్లినట్లు చెప్పారు.