న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. రాహుల్కు ఏమీ తెలియదని దుయ్యబట్టారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాశనం చేస్తున్నారని రీసెంట్గా రాహుల్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్ మీద బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ గురించి ఆయనకేమీ తెలియదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు.
‘ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వరంగ సంస్థలు బలహీనం కాలేదని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆ టైమ్లో ప్రభుత్వం అన్ని సంస్థలను, వ్యవస్థలను అణచివేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. దాదాపుగా అన్ని పార్టీలను నిషేధించారు. వార్తాపత్రికలనూ మూసేశారు. ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవడానికి రాహుల్కు చాలా టైమ్ పడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద దేశభక్తి స్కూల్ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే’ అని జవదేకర్ స్పష్టం చేశారు.