రమేశ్​ను డానిశ్ రెచ్చగొట్టిండు : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే

రమేశ్​ను డానిశ్ రెచ్చగొట్టిండు : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే
  • రమేశ్​ను డానిశ్ రెచ్చగొట్టిండు
  • ప్రధాని మోదీని తిట్టిండు : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే

న్యూఢిల్లీ : ఇటీవల లోక్ సభలో చంద్రయాన్ 3 సక్సెస్​పై చర్చ సందర్భంగా తమ పార్టీ ఎంపీ రమేశ్ బిధూరీని బీఎస్పీ ఎంపీ డానిశ్ అలీ రెచ్చగొట్టారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లెటర్ రాశారు. 

‘‘రమేశ్ మాట్లాడుతున్నంతసేపు డానిశ్ పక్క నుంచి కామెంట్లు చేశారు. ప్రధాని మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 విజయాన్ని తక్కువ చేసి మాట్లాడారు. మైక్ లేకుండా రన్నింగ్ కామెంట్రీ చేస్తూ రమేశ్​ను రెచ్చగొట్టారు. దీంతో రమేశ్ సహనం కోల్పోయారు” అని అందులో పేర్కొన్నారు. లోక్ సభలో డానిశ్ అలీ అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపించాలని కోరారు. ‘‘డానిశ్ అలీపై రమేశ్ చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదు. వాటిని ఎవరూ సమర్థించరు. నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నా” అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చెప్పారు.