న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన మత విద్వేషకామెంట్ల వ్యవహారం ప్రివిలేజ్ కమిటీకి చేరింది. ఈ మేరకు ప్రతిపక్షాల సభ్యులు చేసిన ఫిర్యాదులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం బీజేపీ సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో డానిష్పై బిధూరి చేసిన అనుచిత కామెంట్లు కలకలం రేపాయి. వాటిపై అపొజిషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిధూరిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.
ప్రతిపక్షాల మండిపాటు
రమేశ్ బిధూరీని బీజేపీ రెండ్రోజుల కింద రాజస్థాన్లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా అపాయింట్ చేయడంపై అపొజిషన్ పార్టీలు విమర్శలు చేశాయి. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎంపీకి.. బీజేపీ పట్టం కడుతోందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మండిపడ్డారు. ముస్లింలపై కామెంట్లు చేసినందుకు బిధూరీని బీజేపీ ప్రమోట్ చేస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రీ కూడా విమర్శించారు.