రాజస్థాన్ లో బీజేపీ రెబల్స్ హవా.. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపు

రాజస్థాన్ లో బీజేపీ రెబల్స్ హవా.. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపు

జైపూర్: ఎన్నికలను డబ్బులు శాసిస్తున్న వేళ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం ఆశ్చర్యకరమే. అటువంటి అరుదైన ఘటనలు రాజస్థాన్ లో చోటు చేసుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.  చిత్తోర్ గఢ్ లో చంద్రభాన్ అక్య, షియోలో రవింద్ర సింగ్ భాటి, దీద్వానాలో యూనస్ ఖాన్, బయనాలో రితు బనావత్ స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు.

బీజేపీ వీరికి టికెట్​ నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి గెలుపొందారు. చంద్ర బాన్ అక్య 6823 ఓట్లు, రవింద్ర సింగ్ భాటి 4034 ఓట్లు, యూనస్ ఖాన్ 2392 ఓట్లు, రితు బనావత్ 40642  ఓట్ల మెజార్టీతో గెలిచారు.