జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిటే ..కాంగ్రెస్ ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహిత్

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిటే ..కాంగ్రెస్ ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహిత్

ఓల్డ్​సిటీ, వెలుగు: రానున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ  సింగిల్​ డిజిట్​కు పరిమితం కావడం ఖాయమని కాంగ్రెస్​ ఖైరతాబాద్అధ్యక్షుడు మోత రోహిత్​ముదిరాజ్​ అన్నారు. సోమవారం గాంధీభవన్ లోని  ప్రకాశం హాల్​లో ఓట్ చోరీ సంతకాల సేకరణ చేపట్టగా.. ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్​ కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి ఓట్లు నమోదు చేయించాలని సూచించారు.

 ఎక్కడైనా ఓట్ చోరీలు ఉంటే గుర్తించి నిజమైన ఓటర్లకు స్థానం కల్పించేలా కృషి చేయాలన్నారు. గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దొంగ మాటలు చెప్పి 48 సీట్లు గెలుచుకుందని, ఈసారి ఒక్క సీటు రాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే రాములు, కాంగ్రెస్​ నాంపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి ఫెరోజ్ ఖాన్, కార్వాని ఇన్​చార్జ్ ఉస్మాన్ బిన్ మొహమ్మద్​ హల్​ హజరి, మాజీ కార్పొరేటర్​ మమత సంతోష్​ గుప్తా, శుంభుల శ్రీకాంత్​ గౌడ్​  పాల్గొన్నారు.