మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: హాజీపూర్ మండలం రాంపూర్గ్రామానికి చెందిన డీపీవో ఆఫీస్సీనియర్ అసిస్టెంట్ అనిల్, సునీల్రావు కుటుంబాన్ని ఆదివారం బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల అనిల్, సునీల్తల్లి మృతిచెందింది. విషయం తెలుసుకున్న వివేక్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్వెరబెల్లి తదితరులు ఉన్నారు. బెల్లంపల్లిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని రాజనర్సు, ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణను వివేక్వెంకటస్వామి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో రాజనర్సు, కృష్ణల తల్లి మృతిచెందింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మునిమంద రమేశ్, అందుగుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీశ్గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, లీడర్లు ఎరుకల శ్రీనివాస్, రాచర్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్ఏల పోరాటానికి బీజేపీ మద్దతు
వీఆర్ఏల పోరాటానికి బీజేపీ అండగా నిలుస్తుందని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు. బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన దీక్షను ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, నియోజక వర్గ ఇన్చార్జి కొయ్యాల ఏమాజీ, లీడర్లు రాచర్ల సంతోష్, బి. కేశవరెడ్డి, రాజులాల్ యాదవ్, ఎరుకల శ్రీనివాస్, ఎరుకల నర్సింగ్, గోమాస కమల, నల్లుల సంగీత, గోలి శ్రీనివాస్, చిలుముల కృష్ణదేవరాయులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో పలువురి చేరిక
జైపూర్,వెలుగు: బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సమక్షంలో మందమర్రికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. వరదలతో జైపూర్మండలం వేలాల గ్రామంలో నష్టపోయిన కుటుంబాలను ఆదివారం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా మందమర్రికి చెందిన వైశ్య సంఘం లీడర్రావికంటి అశోక్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్, పార్టీ మండల ప్రెసిడెంట్ చల్ల విశ్వంబర్రెడ్డి, ఓబీసీ సెల్జిల్లా ఉపాధ్యక్షుడు అక్కల రమేశ్, ప్రధాన కార్యదర్శి డేగ నగేశ్, లీడర్లు జాడి ఏసయ్య, పోశన్న, బల్ల వెంకటేశ్, చెగొండ శ్రీనివాస్, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు.