హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం : బండి సంజయ్

హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం : బండి సంజయ్

హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్ గా రాష్ట్రం మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘‘ మేం రోజుకో దేవుడిని మొక్కుతం. మేము దేవుడిని మొక్కితే కొంతమందికి నొప్పి అవుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కూకట్ పల్లి లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘అయ్యప్పను కించపరిచే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని.. హిందూ దేవుళ్లను కించపరిస్తే బీజేపీ సహించదని అన్నారు. అలాంటి వారిని  హిందూవాహిని తదితర ధర్మ సంఘాలు ఉపేక్షించవని ’’ స్పష్టం చేశారు.

‘‘ఏ రాజకీయ పార్టీలో ఉన్నవారైనా  హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోవద్దు. మన కల్చర్ ను మనమే కాపాడుకోవాలి. సంఘటితంగా ఉంటేనే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలం. బడిత పూజ చేయండి. నాకెందుకని ఊరుకోకండి’’ అని పేర్కొన్నారు. ‘‘హిందువుగా పుట్టినవాళ్లం హిందువుగానే చచ్చిపోదాం. మహిళలు బొట్టు బిళ్ళలు కాకుండా కుంకుమ బొట్టును పెట్టుకోండి . పురుషులు షార్ట్స్ వేసుకొని తిరగడం బందు చేయండి.. దయచేసి కల్చర్ ను కాపాడండి’’ అని బండి సంజయ్ ఈసందర్భంగా  కోరారు.