మల్కాజిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన బండి సంజయ్ యాత్ర 

మల్కాజిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన  బండి సంజయ్ యాత్ర 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మల్కాజిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జేఎల్ఎన్ఎస్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాలనీ వాసుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వచ్చినా సమస్యలు తీరలేదని తమ గోడును బండి సంజయ్ కు వివరించారు.  రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఉపాధి లేక బతుకు కష్టంగా మారిందని..ఉండటానికి ఇల్లు కూడా లేదని వాపోయారు. పిల్లలను చదివించుకునేందుకు ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. 

జేఎల్ఎన్ఎస్ నగర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు బండి సంజయ్ హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కాలనీలో సమస్యలు లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. పేదోళ్ల ప్రభుత్వం వచ్చాక అర్హులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.