ఇవాళ తాండూరుకు బండి సంజయ్

ఇవాళ తాండూరుకు బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ తాండూరుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి పలువురు పార్టీ లీడర్లతో కలిసి ఆయన తాండూరుకు బయల్దేరనున్నారు. అక్కడ  బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ కుటుంబాన్ని సంజయ్ పరామర్శించనున్నారు. ఇటీవల మురళి గౌడ్‌ ఇంటిపై స్థానిక బీఆర్ఎస్  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దీంతో విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఇంట్లో ఉన్నవారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని కలిసేందుకు సంజయ్ తాండూరుకు వెళ్లనున్నారు.  

కాగా ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బీఆర్ఎస్  ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి  85 మంది రౌడీ షీటర్లను తన ఇంటిపైకి పంపించి దాడులకు పురిగొల్పారని, వారు సృష్టించిన బీభత్సంపై కేంద్ర, రాష్ట్ర బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేశామని మురళీకృష్ణ గౌడ్ తెలిపారు. మానవ హక్కుల సంఘానికీ ఫిర్యాదు చేస్తానన్నారు.