- పోస్టర్ విడుదల చేసిన పార్టీ నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఈ నెల7న బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థి మహాధర్నా నిర్వహించనున్నది. ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈనెల 7న జరిగే ధర్నాకు పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షత వహించనున్నారని, చీఫ్ గెస్టులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏలేటి మహేశ్వర రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు.
