కేసీఆర్ సైకో, శాడిస్టులా వ్యవహరిస్తున్నాడు

కేసీఆర్ సైకో, శాడిస్టులా వ్యవహరిస్తున్నాడు

కేసీఆర్ సర్కారు 317 జీఓను సవరించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.  జీఓను సవరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో ఉంటున్న కేసీఆర్.. ఉద్యోగులను మాత్రం కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. 9 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317 జీఓపై చర్చించకపోవడం దుర్మార్గమని అన్నారు. కుటుంబాలను విడదీస్తున్న కేసీఆర్ సైకో, శాడిస్టులా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమవుతుందో కేసీఆర్ తెలుసుకోవాలని హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే కేసీఆర్ జాతకం బాగాలేదని అర్థమవుతోందన్న సంజయ్.. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని, టీచర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బండి సంజయ్.. మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త డ్రామాలు ఆడుతున్న కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..

టెస్టు కెప్టెన్సీపై మనసులోమాట బయట పెట్టిన రాహుల్