యూపీలో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుంది...అమిత్షా

యూపీలో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుంది...అమిత్షా
  • మోదీ నేతృత్వంలో మళ్లీ అధికారం సాధిస్తాం
  • యోగి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు

ఉత్తరప్రదేశ్ : త్వరలో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుందని బీజేపి సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. గోరఖ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ..2014, 2017, 2019లో జరిగిన ఎన్నికల్లో యూపీ ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపికి పట్టం కట్టారన్నారు. ఈ సారి కూడా యూపీలో గెలిచేది తామేనని అమిత్షా అన్నారు. 2013లో తాను యూపీ బీజేపి ఎన్నికల ఇంచార్జ్గా వచ్చానన్నారు. అప్పుడు అందరూ కనీసం బీజేపికి రెండంకెల సీట్లు వస్తే గొప్ప విషయమన్నారు. కానీ ఎన్నికల తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ప్రతిపక్షాలను రెండంకెల సీట్లకు పరిమితం చేశామని గుర్తు చేశారు అమిత్షా. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టిందని, కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా వేగంగా పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషి చేశారన్నారు. యూపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్రంలో, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని అమిత్షా  ధీమా వ్యక్తం చేశారు.

 

ఇవి కూడా చదవండి..

సొంత బిడ్డను ఎలుగుబంటిపైకి విసిరేసింది

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు