డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బీజేపీ ఆందోళనలు.. 25న ధర్నాచౌక్ వద్ద మహాధర్నా

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బీజేపీ ఆందోళనలు..  25న ధర్నాచౌక్ వద్ద మహాధర్నా

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బీజేపీ ఆందోళనలు

25న ధర్నాచౌక్ వద్ద మహాధర్నా 

హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బీజేపీ ఆందోళనలు చేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నేతలు పరిశీలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. 24న అన్ని జిల్లా కేంద్రాల్లో  ధర్నా చేయనున్నట్టు అందులో పేర్కొంది. 25న హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపింది. గ్రేటర్ లో లక్ష ఇండ్లు, జిల్లాల్లో మరో లక్షా 70 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే గత 8 ఏండ్లుగా ఇండ్ల నిర్మాణం నెమ్మదిగా సాగుతున్నది. కొన్ని ఇండ్లు పూర్తయినా మూడేండ్లుగా అర్హులకు అందజేయడం లేదు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఆందోళనలకు ప్లాన్ చేసింది.