తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపడం బాధకరం : విజయశాంతి

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపడం బాధకరం : విజయశాంతి

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపడం బాధకరమని అన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. బీఆర్ఎస్ లీడర్ల అరాచకాలను మల్లన్న బయట పెడుతున్నారని, అందుకే ఆయనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. మార్చి 23న  పీర్జాదిగూడాలోని  మల్లన్న కుటుంబాన్ని ఆమె బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు.

బీఆర్ఎస్ లీడర్లు  చేస్తున్న అక్రమాలను ఏ మీడియాలో ప్రసారం చేస్తే వాళ్ళ పై అక్రమ కేసులు నమోదు చేయడం చాలా దారుణమని చెప్పారు. ఒక ఉద్యమకారుడిగా ఉన్న సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని తెలిపారు. మల్లన్న కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్తారని విజయశాంతి హెచ్చరించారు.