రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమాజిగూడలోని ఠాకూర్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశంలో మోదీ సారధ్యంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి విస్మరించిందని విమర్శించారు.
రైతులకు రుణ మాఫీ, ఎకరానికి 10వేల సాయం చేస్తామని చెప్పి మోసగించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు తదితరులు పాల్గొన్నారు.