కరోనా రోజు రోజుకి విజృంబిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో సామాన్య ప్రజలతో పాటు ఎక్కువగా సినీ సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ మరోసారి కరోనా బారిన పడ్డాడు. అర్జున్ కపూర్ తో సహా ఆయన ఫ్యామిలిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అర్జున్ కపూర్ రెండవసారి కోవిడ్ బారిన పడ్డాడు. 2020 సెప్టెంబర్ లో అర్జున్ కపూర్ కి తొలిసారి కరోనా సోకింది. అప్పుడు అర్జున్ కపూర్ చికిత్స తీసుకుని కోలుకున్నాడు.
ప్రస్తుతం అర్జున్ కపూర్ తో పాటు.. ఆయన సోదరి అన్షులా, బాబాయ్ అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్, ఆమె భర్త కరణ్ లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీనితో వారంతా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ముంబై మున్సిపల్ అధికారులు అర్జున్ కపూర్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ని శానిటైజ్ చేసి సీజ్ చేసినట్లు సమాచారం. అర్జున్ కపూర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్న వారికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు ఆయన ప్రేయసి మలైకా అరోరా కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం...
ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు