- ట్యునీషియా తీరంలో ఆఫ్రికా వలసదారుల మృతి
ట్యూనిస్: ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని ఐరోపాకు వలస వెళ్తున్న సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలకు చెందిన 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మెడిటేరనియన్ సముద్రం మీదుగా ఇటలీకి వెళ్తున్న రెండు బోట్లు ట్యునీషియాలోని మహ్దియా నగరం సమీపంలోని సముద్ర జలాల్లో మునిగిపోయాయి. ఈ ఘటనలో 19 మందే మృతిచెందారని తొలుత ప్రకటించారు.
అయితే రెస్క్యూ టీమ్స్గాలించడంతో బోటు మునిగిపోయిన ప్రదేశంలో మరో 10 డెడ్ బాడీస్ దొరికాయి. ట్యునీషియా కోస్ట్ గార్డ్ దళాలు ఎంతో శ్రమించి ఐదుగురిని రక్షించారు. ట్యునీషియాలోని ఎస్ఫాక్స్ నగరం సమీపంలోని సముద్ర జలాల్లో గత ఐదు రోజుల వ్యవధిలో ఆఫ్రికా వలసదారులతో వెళ్తున్న ఐదు బోట్లు మునిగిపోయాయి. ఈ ఘటనల్లో 9 మృతదేహాలు లభ్యమవగా, 67 మంది ఆచూకీ గల్లంతైంది.