బోధన్,వెలుగు: బోధన్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్, డీగ్రీ కాలేజీలోని నామినేషన్ సెంటర్లను, హెల్ప్ డెస్క్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని సూచించారు.
నామినేషన్ సెంటర్లలోని రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నియమనిబంధనాలు పాటించాలన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
